తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్గా మారుస్తూ మంగళవారం నాడు ఏపీ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీ మరియు దాని పరిధిలో ఉన్న 11 గ్రామ పంచాయతీలను, అదేవిధంగా తాడేపల్లి మున్సిపాలిటీ మరియు దాని పరిధిలో ఉన్న మరో 10 గ్రామ పంచాయతీలను కొత్త మున్సిపల్ కార్పొరేషన్(మంగళగిరి-తాడేపల్లి) పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్ గా మారుస్తునట్టు ప్రభుత్వం జారీ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ