ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 5 కేటగిరులుగా విభజించి సెలవులను మంజూరు చేస్తునట్టు పేర్కొన్నారు. కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి మరియు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి 20 రోజులు కమ్యూటేడ్ సెలవు ఇవ్వనున్నారు. అలాగే ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కరోనా సోకినా కూడా వారికి 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. కాగా మార్చి 25, 2021 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ