5,6 తేదీలలో జనసేన మేధోమధనం

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Janasena Latest Updates, Janasena Latest Updates 2019, Janasena To Hold PAC Meetings At Dindi, Janasena To Hold PAC Meetings At Dindi on September 5 6, Mango News Telugu, Pawan Kalyan Janasena, Pawan Kalyan Janasena Latest News, Pawan Kalyan Janasena Party Updates

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇటీవలే కొన్ని నియోజక వర్గాల సమీక్ష సందర్భంగా నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాలు ఈ నెల 5,6 తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని దిండి గ్రామంలో జరగనున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలలో పాల్గొని పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులుతో వివిధ అంశాలపై మేధోమధనం జరపనున్నారు.

గతంలో రాజకీయాలు- ఇప్పటి రాజకీయాలు, వ్యవసాయ రంగం, సభలు, చర్చ కార్యక్రమాలలో పార్టీ నిర్ణయాలను సమర్ధవంతంగా వినిపించడం, సమాచార హక్కు, పౌర పాలన, న్యాయ-ధర్మ సూత్రాలు, స్థానిక పరిపాలన వంటి అనేక అంశాలపై అవగాహనా సమావేశాలు జరుగుతాయి. వివిధ అంశాలలో నిపుణులైన వారు ఈ మేధోమధన సమావేశాల్లో పాల్గొంటారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర పీఏసీ సభ్యులు నాలుగోతేదీ సాయంత్రానికే దిండి చేరుకుంటారు.

 

[subscribe]
[youtube_video videoid=0ypvk7tZDVY]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − three =