జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇటీవలే కొన్ని నియోజక వర్గాల సమీక్ష సందర్భంగా నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాలు ఈ నెల 5,6 తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని దిండి గ్రామంలో జరగనున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలలో పాల్గొని పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులుతో వివిధ అంశాలపై మేధోమధనం జరపనున్నారు.
గతంలో రాజకీయాలు- ఇప్పటి రాజకీయాలు, వ్యవసాయ రంగం, సభలు, చర్చ కార్యక్రమాలలో పార్టీ నిర్ణయాలను సమర్ధవంతంగా వినిపించడం, సమాచార హక్కు, పౌర పాలన, న్యాయ-ధర్మ సూత్రాలు, స్థానిక పరిపాలన వంటి అనేక అంశాలపై అవగాహనా సమావేశాలు జరుగుతాయి. వివిధ అంశాలలో నిపుణులైన వారు ఈ మేధోమధన సమావేశాల్లో పాల్గొంటారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర పీఏసీ సభ్యులు నాలుగోతేదీ సాయంత్రానికే దిండి చేరుకుంటారు.
[subscribe]
[youtube_video videoid=0ypvk7tZDVY]