ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. శ్రీశైలం దేవాలయం ఈవోగా ఎస్.లవన్నను నియమించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా హెచ్.వి జయరాంను నియమించారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీల వివరాలు:
- కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా ఏక మురళి నియామకం.
- అమలాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా ఎన్.ఎస్.వి.బి వసంతరాయుడు
- కృష్ణా జిల్లా ఏపీఎస్సీసీఎఫ్సీ కృష్ణా జిల్లా ఈడీగా బి.చంద్రలీల
- గురజాల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా పార్ధసారధి
- పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా వసంతబాబు
- కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా యు.రంగస్వామి
- నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా ఆర్.గోవిందరావు
- రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఓఎస్డీగా నర్సింహులు
- శ్రీశైలం దేవాలయం ఈవోగా ఎస్.లవన్న
- ప్రస్తుత ఈవో కేఎస్ రామారావును సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు
- శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా హెచ్.వి.జయరాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ