ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే బియ్యం కార్డులను(తెల్ల రేషన్ కార్డు) ఆ కుటుంబం యొక్క ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని నిర్ణయించారు. ఈ మేరకు జూలై 25, శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పాటించాలని రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్లు, ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. మరోవైపు ఇతర కుటుంబాలకు జారీ చేసే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కాలపరిమితిని 4 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu