ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉతర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ఏటిపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం మండలాలతో కలిపి చింతూరు రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం వరద బాధితులను పరామర్శించేందుకు చింతూరు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రజలు చింతూరు డివిజన్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ డివిజన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఇప్పుడు సీఎం హామీ మేరకు చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చింతూరు ప్రజలు సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీ నెరవేర్చారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY