ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర’పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పలు ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో బోగాపురం ఎయిర్పోర్ట్ , గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ వెనకుండి నడిపిస్తోందన్న విషయం బయట పడిందని, ఇక మళ్ళీ వారి పాదయాత్ర కొనసాగుతుందన్న నమ్మకం తమకు లేదని తెలిపారు.
ఆరు వందల మందితో చేస్తున్న పాదయాత్రలో కనీసం అరవై మంది కూడా రైతులు లేరని, టీడీపీ వారే రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు. ఇది బయటపడినందునే పాదయాత్రను ఆపేశారని, వారెన్ని ప్రయత్నాలు చేసిన ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతు ఇవ్వరని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ పరిపాలనా రాజధాని ఇక సాకారం అయినట్టేనని, అలాగే విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు త్వరలోనే పరిష్కరమవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY