రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కోవిడ్ విధుల్లో పాల్గొని సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో భాగంగా కరోనా బాధితులకు సేవలందిస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఎవరైనా వైద్యులు కరోనాతో మృతి చెందితే, వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కేఎస్ జవహర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైద్యుడు కరోనాతో మరణిస్తే ఆ జిల్లాకు సంబంధించిన డీఎంహెచ్వో లేదా డీసీహెచ్ఎస్ కు వివరాలు పంపాలని, బోధనాసుపత్రి అయితే సూపరింటెండెంట్ కు వివరాలు అందించాలని పేర్కొన్నారు. వివరాలు అందిన వెంటనే వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu