ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. కొత్తగా 8368 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 8368 కేసులతో కలిపి సెప్టెంబర్ 7, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 5,06,493 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 58,187 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన ప్రకాశంలో పదిమంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కర్నూల్ లో నలుగురు, అనంతపూర్ లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4487 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 4,04,074 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 10055 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 97932 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu