పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను సెప్టెంబర్ 11 న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న చింతమనేని ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ రెండు నెలల కాలంలోనే చింతమనేని ప్రభాకర్ పై దాదాపుగా 9 కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఆయనపై పోలీసులు మరో కేసును నమోదు చేసారు.
పెదవేగి మండలంలోని పినకడిమి గ్రామానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో ఆయన్ను మూడో నిందితుడిగా పేర్కొంటూ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చింతమనేనిని పిటీ వారెంటుతో అరెస్టు చేసి ఏలూరు కోర్టుకు పోలీసులు తరలించిన నేపథ్యంలో, కోర్టు చింతమనేనికి అక్టోబర్ 28 వరకు రిమాండ్ విధించింది. అయితే రేపు(అక్టోబర్ 23) బెయిల్ పై ఆయన విడుదల కావాల్సి ఉండగా, ముందు రోజునే పోలీసులు మరో కేసు నమోదు చేయడం విశేషం.
[subscribe]