రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Breaking News, AP Govt Withdraws Several Cases, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Cases Related To Movements Across The State, Mango News Telugu, YCP Latest News
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సమయాల్లో పలు ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ డిసెంబర్ 17, మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ జారీ చేశారు. 2016, జనవరి నెలలో కాపు ఉద్యమం జరిగిన సమయంలో తుని, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే భోగాపురంలో విమానాశ్రయ ఏర్పాటు భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు గుంటూరు, అనంతపురం సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ ఆస్తుల ధ్వంసం సందర్భంగా నమోదైన పలు కేసులను ఎత్తివేసున్నామని కిశోర్‌ కుమార్‌ తెలిపారు.

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =