ఆంద్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ నిఘా విభాగపు హెడ్ ఏబీ వెంకటేశ్వరరావుకి లైన్ క్లియర్ అయ్యింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకట్ట వేసిన సీఎస్ జవహార్ రెడ్డి ఆదేశాలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. అర్జిత సెలవుల కింద ఏబీవీ విదేశీ పర్యటనకు వెళ్లవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దాంతో తాజా ఉత్తర్వుల ద్వారా విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగినట్టయ్యింది.
చంద్రబాబు హయంలో ఏబీ వెంకటేశ్వర రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇంటిలిజెన్స్ చీఫ్ హోదాలో అనేక వ్యవహారాల్లో చురుగ్గా స్పందించేవారు. దాంతో ఆయన వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపింది. దానికి తగ్గట్టుగానే అధికారం మారిన వెంటనే ఏబీవీకి ఇక్కట్లు మొదలయ్యాయి. అనేక ఆరోపణలు వచ్చాయి. నేరుగా అవినీతి కేసులు బయటకు వచ్చాయి. దాంతో పాటుగా ఆయన మీద సస్ఫెన్షన్ కూడా విధించారు. దాంతో దానిని తొలగించడానికి ఆయన పలు విధాలా పోరాడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇజ్రాయేల్ నుంచి స్పై వేర్ కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందారనే అభియోగంతో ఆయన ఇక్కట్లలో పడ్డారు.
అన్నీ తొలగించుకుని విధుల్లో చేరాలనుకున్న ఆయనకు బాధ్యతలు అప్పగించడం కూడా పెద్ద తంతుగా నడిచింది. ఆయనకు విధులు కేటాయించకుండా తాత్సార్యం జరుగుతోంది. ఈలోగా విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్న ఏబీవీ మీద గతంలో ఉన్న ఫిర్యాదులు, ఇతర కారణాలు చూపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి నిరాకరించారు. దాంతో ఆయన కోర్టుకెళ్లారు. తన పర్యటనకు ఏపీ ప్రభుత్వం పెడుతున్న అడ్డంకులు తొలగించాలని కోరారు. ఆయన వినతిని విచారణ తర్వాత కోర్టు అంగీకరించింది. దాంతో ఏబీవీ విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగినట్టయ్యింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE