తెలుగుదేశం పార్టీ (టిడిపి) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటి నుండి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పర్యటన సందర్భంగా బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం కొల్లపల్లెలో పార్టీల జెండాలు పెట్టే విషయంలో మొదలైన వివాదం అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యాకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే కుప్పంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అధికారపార్టీ ప్రయత్నిస్తోందని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని స్ఫష్టం చేశారు. పోలీసులు అధికారపక్షానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. తాను పర్యటనను కొనసాగిస్తానని, నియోజకవర్గంలో ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY