ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాసంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదు – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

TRS Disrupting Praja Sangrama Yatra To Divert Attention Says Telangana BJP Chief Bandi Sanjay, Telangana BJP Chief Bandi Sanjay Says TRS Disrupting Praja Sangrama Yatra To Divert Attention, TRS Disrupting Praja Sangrama Yatra To Divert Attention Telangana BJP Chief Bandi Sanjay, Fourth Phase Of Praja Sangrama Yatra, Praja Sangrama Yatra, Telangana BJP State President Bandi Sanjay Kumar, Bandi Sanjay Kumar arrest, TRS, Praja Sangrama Yatra News, Praja Sangrama Yatra Latest News And Updates, Praja Sangrama Yatra Live Updates, Mango News, Mango News Telugu,

ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా కరీంనగర్‌లోని తన నివాసం వద్ద సంజయ్‌ బుధవారం మధ్యాహ్నం వరకూ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాసంగ్రామ యాత్రకు అంతరాయం కలిగిస్తోందని, ఈ నెల 27 ముగింపు రోజున హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణం విచారణ నుంచి తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, దీనిలో ఎలాంటి తప్పు చేయలేదని నిరూపితమయ్యే వరకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్ కు సంజయ్ సూచించారు. టీఆర్‌ఎస్‌ అవినీతి అక్రమాలకు అడ్డుకుంటున్నందుకే బీజేపీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని, కొనసాగించి తీరుతామని బండి సంజయ్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =