ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలపై జనసేన ప్రచారం అసత్యమని తేలిపోయిందని పేర్కొన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. కూల్చివేతలపై హైకోర్టు తీర్పుతో నిజానిజాలు నిగ్గుతేలాయని, ఇందులో ప్రభుత్వం తరపునుంచి ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటం గ్రామంలో ఏం జరిగిందో అందరూ చూశారని, అక్కడ ఎదో అన్యాయం జరిగిపోతుందని ప్రతిపక్షాలు సహా ఒక వర్గం మీడియా గగ్గోలు పెట్టారని, వారందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు.
జనసేన పార్టీ ఈ విషయంలో స్థాయిని దాటి విమర్శలు చేసిందని, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వైసీపీ ప్రభుత్వాన్నే కూల్చేయాలని పిలునిచ్చారని మంత్రి అంబటి గుర్తుచేశారు. ఎవరైతే బాధితులుగా ప్రచారం చేశారో.. వారే అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారని తెలిపారు. కోర్టు విచారణలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయని, ప్రభుత్వ పరంగా ఎలాంటి తప్పు లేదని కోర్టు గుర్తించిందని వెల్లడించారు. ఈ కేసులో కొందరు కోర్టుని మభ్యపెట్టి స్టే తెచ్చుకున్నారని అర్థమైందని, అందుకే దీనిలో భాగమున్న 14 మందికి రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధించిందని అంబటి తెలియజేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీలపై సోదాలు జరుగుతున్నాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మార్గదర్శి సంస్థ కొన్ని అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోందని, ఒకవేళ ఇదే కనుక నిజమని తేలితే ఆ సంస్థల అధినేత రామోజీ రావుపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE