ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేశారని ఆరోపించారు. సభలో స్పీకర్ స్థానానికి ఎంతో గౌరవం ఉంటుందని, కానీ టీడీపీ సభ్యులు చివరికి స్పీకర్ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు సభలో హుందాగా ప్రవర్తించలేదని, అరుపులతో సభ వ్యవహారాలను ప్రతిరోజూ అడ్డుకుంటున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
టీడీపీలో అందరూ సీనియర్ సభ్యులేనని, వారికి అసెంబ్లీ కొత్తకాదని, అయినాసరే వారు మొదటిసారి ఎన్నికైన సభ్యుల కన్నా దారుణంగా ప్రవర్తించారని విమర్శించారు. బయట ఎలా ఉంటారో సభలో కూడా అలాగే ఉండటం సరికాదు. మొన్న కూడా స్పీకర్ మీద కాగితాలు విసిరేశారు, ఈరోజేమో సభలో విజిల్ వేశారు. ఇలాంటివాటిని ఎవరూ సహించరాని, సభను హుందాగా నడపటానికే స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీని గెలిపించి తప్పు చేశామని అనటం కరెక్ట్ కాదని, ఆయన వ్యాఖ్యలని ఖండిస్తున్నామన్నారు. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం ఇష్టం లేకపోతే సీఎం జగన్కు తన అభిప్రాయాలు చెప్పాలని, అంతేకాని ఇష్టానుసారం మాట్లాడటం పద్దతి కాదన్నారు మంత్రి పేర్ని నాని.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ