ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఏపీలో విజయనగరం, ఏలూరు, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటుగా గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లలో మరియు 13 జిల్లాలోని 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం మొత్తం 17,418 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 2,900 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల తుదిజాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి అధికార వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. పలు జిల్లాల్లోని కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో మెజార్టీ డివిజన్స్, వార్డులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా ఆయా కార్పొరేషన్స్ మరియు మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈ విధంగా ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్, ఆ జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. ఇక ఈ ఎన్నికలకు మార్చి 10 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 14 వ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ