ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్ ) 73వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి, వైఎస్సార్ సతీమణి శ్రీమతి విజయమ్మ, కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. వారితోపాటు పలువురు వైఎస్సార్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే వైఎస్సార్ అభిమానులు పలువురు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. కాగా సీఎం జగన్ ఈ కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ వద్ద జరగనున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొని, సమావేశాలను ప్రారంభిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ