ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్రప్రభుత్వం గురువారం నాడు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని, రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ముందుగా రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోకి వస్తుందని ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు దాఖలైంది. ఈ పిటిషన్ కి సంబంధించి పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ రాజధానికి సంబంధించిన అన్ని వివరాలతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu