ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశమయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని సమర్ధిస్తూ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తన రాజీనామాకు సీఎం జగన్ అనుమతివ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా వెనుకబాటుతనంలో ఉందని, అయితే సీఎం తీసుకున్న నిర్ణయం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఒక అవకాశం వచ్చిందని తెలిపారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కన్నా, మంత్రి పదవి తనకు ముఖ్యం కాదని ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు కుట్రలతో దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకే తాను రాజీనామా చేసి మళ్ళీ గెలవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని బలంగా చాటుతానని చెప్పారు. కాగా మంత్రి ధర్మాన కోరికను సీఎం జగన్ సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధే మన ప్రభుత్వ ధ్యేయమని, వికేంద్రీకరణ-సమగ్రాభివృద్ధే మన విధానమని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY