ఏపీలో నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం, రేపు ఏరియల్‌ సర్వే చేయనున్న సీఎం జగన్

AP Cyclone Nivar News, AP YS Jagan will Conduct Aerial Survey, Cyclone, Cyclone in AP, Cyclone Nivar, Cyclone Nivar hit Andhra Pradesh, Cyclone Nivar live, Cyclone Nivar Live Updates, Cyclone Nivar Tracker, Mango News Telugu, Nivar Cyclone Affected Areas, Nivar Cyclone Effect On AP, Nivar Cyclone live updates, Weather Forecast Today, YS Jagan Aerial Survey Nivar Cyclone Affected Areas

నివర్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. భారీ వర్షాలతో పెద్దఎత్తున పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం నాడు ఏరియల్‌ సర్వే చేయనున్నారు. అనంతరం తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై తిరుపతి నగరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో నివర్ తుఫాన్ వలన జరిగిన నష్టంపై ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో కూడా సీఎం వైఎస్ జగన్ కీలకంగా చర్చించారు. 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతినట్టు ప్రాథమిక అంచనాకి వచ్చారు. పంట నష్టంపై డిసెంబర్ 15 లోపు అంచనాలు రూపొందించి, తుఫాన్ బాధిత రైతులకు డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే తుఫాన్ ప్రభావంతో పునరావాస శిబిరాలకు ఉన్నవారికి వెంటనే రూ.500 అందించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − four =