ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ నూతన ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఈ ఏడాది ఆగస్టు నెలలో ఏటీసీ టైర్స్ తమ నూతన ప్లాంట్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అచ్యుతాపురం వద్ద రూ.1,750 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తుండగా, ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు సహా పలు అంశాలను కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF