ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు మరిన్ని సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏటీఎం సేవలు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ప్రస్తుతం సచివాలయాల ద్వారా పల్లెల్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాల సేవలను అందిస్తున్న సర్కారు తాజాగా ఏటీఎం సేవలను దశలవారీగా అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన కొనుగోళ్లు చేసే రైతులకు ఈ ఏటీఎంలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆయన వెల్లడించారు.
దీనిలో భాగంగా.. మొదటి దశలో వచ్చే ఉగాది నాటికి కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సచివాలయంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. రెండో దశలో రెవెన్యూ డివిజన్స్ లో ఎక్కువ కార్యకలాపాలు కొనసాగే ఒక్కో సచివాలయంలో.. అలాగే, మూడో దశలో మండల కేంద్రాల్లో అధిక కార్యకలాపాలు జరిగే ఒక్కో సచివాలయంలోను ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలను చేపట్టింది. తొలిదశలో.. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాల కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగేచోట ఉగాది నాటికి జిల్లాకొక సచివాలయంలో ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నట్లు అజయ్ జైన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ