నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆత్మకూరు ఉపఎన్నికకు జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ఉపఎన్నికలో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ మేరకు ఆత్మకూరు ఉపఎన్నిక కోసం మండలాలవారీగా వైఎస్సార్సీపీ ఎన్నికల ఇంచార్జిలను నియమించింది. నియోజవర్గంలోని ప్రతి మండలానికి ఒక మంత్రితో పాటుగా, ఓ ఎమ్మెల్యేను కూడా ఇంచార్జిలుగా నియమించారు.
మరోవైపు ఈ ఉపఎన్నికకు మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, నేడు (జూన్ 7) నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక జూన్ 9 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరుతేదీగా ప్రకటించగా, ఎంతమంది అభ్యర్థులు ఉండనున్నారో ఆరోజున తెలియనుంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నుంచి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించింది.
ఆత్మకూరు ఉపఎన్నికకు మండలాలవారీగా వైఎస్సార్సీపీ ఇంచార్జిలు వీరే:
- ఆత్మకూరు రూరల్: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
- ఆత్మకూరు అర్బన్: మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్
- సంగం : మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి
- ఎఎస్పేట: మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే ద్వారకానాథ్రెడ్డి
- అనంతసాగరం: మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి
- చేజర్ల: మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని
- మర్రిపాడు: మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY