వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్, ప్రస్తుతానికి ప్లాంటును ప్రైవేటీకరించే ఆలోచన లేదని, కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం.. ఆర్ఐఎన్ఎల్పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగలేదని, కేంద్ర ప్రభుత్వం మరియు కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని వివరించింది. విశాఖ స్టీల్ప్లాంట్ పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఇక ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా రిపోర్టుల్లో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా తాజా ప్రకటనతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాము వెనక్కి తగ్గలేదని కేంద్రం తేల్చి చెప్పినట్లయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE