విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chandrababu Naidu Latest Political News, Chandrababu Naidu On A Two Day Visit To Visakhapatnam, Chandrababu Naidu Visit To Visakhapatnam, Mango News Telugu, Naidu On A Two Day Visit To Visakhapatnam, Nara Chandrababu Naidu, the President of the Telugu Desam Party

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని పార్టీ కార్యాలయంలో నేతలతో, నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భవిష్యత్ కార్యాచరణ, పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించనున్నారు. ముందుగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు కార్యకర్తలు చేపట్టిన భారీ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. విమానాశ్రయానికి వెళ్తున్న కార్యకర్తలను అడ్డుకోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబు తీవ్రంగా ఖండించారు. విమానాశ్రయం వద్ద పోలీసుల తీరుకు నిరసనగా కార్యకర్తలు నినాదాలు చేసారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =