ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి (నవంబర్ 11, 12 తేదీల్లో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్టు తెలుస్తుంది. పవన్ కల్యాణ్ రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నట్టు సమాచారం. శుక్ర, శని వారాల్లో పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోనే ఉండి ప్రధాని మోదీతో భేటీ అవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు గతం నుంచే పొత్తులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ సహా ఏపీకి సంబంధించి పలు అంశాలపై పవన్ కళ్యాణ్ ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ భేటీపై బీజేపీ లేదా జనసేన నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE