చలో ఆత్మకూరు కార్యక్రమ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి, ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద అడ్డుకొని ఆయన్ను పోలీసులు గృహనిర్బంధం చేసారు. ఈ పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి, బాధితులకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ నిరసన తెలపాలని కోరారు.
మరోవైపు టీడీపీ పార్టీ నిర్వహిస్తున్న పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా చేయకుండా అడ్డుకోవడంతో చంద్రబాబు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. శిబిరంలో ఉన్న బాధితులకు సంఘీభావంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీక్షలో పాల్గొనాలని రాష్ట్రవ్యాపంగా ఉన్న పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. చంద్రబాబును నివాసం వద్ద నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులతో నారా లోకేష్ వాగ్వాదానికి దిగారు, అనంతరం నారా లోకేష్ ను సైతం పోలీసులు గృహ నిర్బంధం చేసారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసే దిశగా, పోలీసులు టీడీపీ నాయకులను బయటకు రానివ్వకుండా ఎక్కడికక్కడా గృహ నిర్బంధం చేస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=x9DrJnLf84o]