ఏకపక్షంగా పోలవరం ఆపేసారు-చంద్రబాబు

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chandrababu Naidu Press Meet At Undavalli Over Polavaram Reverse Tendering, Chandrababu Press Meet At Undavalli, Chandrababu Press Meet At Undavalli Over Polavaram, Chandrababu Press Meet At Undavalli Over Polavaram Reverse Tendering, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడీ అయినా పోలవరం ప్రాజెక్టు, వైసీపీ ప్రభుత్వ విధ్వంసక చర్యలవల్ల ఆగిపోయిందని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరిని దృష్టిలో పెట్టుకుని రిటెండరింగ్ పక్రియ చేపట్టారని ఆరోపించారు. ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ప్రాజెక్టును ఆపివేశారని ఆరోపించారు. ఇప్పటివరకు దేశచరిత్రలోనే ఇంత భారీప్రాజెక్టులో ఎవరూ రివర్స్ టెండరింగ్ కి పోలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానిది రివర్స్ టెండరింగ్ కాదని, రీ టెండరింగ్ అని ఎద్దేవా చేసారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువైన పీటర్ ఇచ్చిన నివేదికలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం, నిపుణులు ఎంత చెప్పిన వినకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయితే వ్యయం కూడ పెరుగుతుందని అన్నారు. గోదావరిలో బోటు మునిగిపోతేనే ఇంతవరకు కనిపెట్టలేని వాళ్ళు పోలవరం రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. టెక్నికల్ బిడ్ మానుకుని, ప్రైస్ బిడ్డింగ్ కు వచ్చారని, భారీ ప్రాజెక్టు విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =