ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యున్నతి మరియు క్రీడల శాఖల మంత్రి ఆర్కే రోజా గురువారం 50వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ క్రమంలో మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి దీవించారు. ఇక దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను పుట్టింది, పెరిగింది, చదువుకుంది తిరుపతిలోనే అని, సాక్షాత్తూ వేంకటేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రంలో ఇదంతా జరగడం తన అదృష్టమని అన్నారు. ఇప్పుడు మంత్రిగా కూడా అవకాశం వచ్చిందంటే ఆ స్వామి చలువేనని, కార్తీక మాసం కావడం, పైగా ఈరోజు జన్మదినం కావడంతో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని వెల్లడించారు. ఏడుకొండలవాడిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదని, స్వామి వంక చుసిన వెంటనే తనకు ఆనందంతో కన్నీళ్లు వస్తాయని మంత్రి తెలిపారు. అలాగే తనకు ఆరోగ్యం ప్రసాదించమని, అలాగే శత్రువులను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని స్వామివారిని ప్రార్ధించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కూతురి సినిమా ఎంట్రీపై మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి రోజా సమాధానమిస్తూ.. తన కుమార్తె, కుమారుడు నటించాలని కోరుకుంటే తప్పకుండా నటించొచ్చని, వారికి ఆ స్వేచ్ఛ తాను ఇస్తానని స్పష్టం చేశారు. అయితే తన కుమార్తెకు ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని, చదువు పైన తనకు శ్రద్ధ ఎక్కువని, సైంటిస్ట్ కావాలనేది తన గోల్ అని తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో తనకు హీరోయిన్ కావాలని అనిపిస్తే, తాను సమర్థిస్తానని, ఒక తల్లిగా ఈ విషయంలో గర్విస్తానని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. ఇక రోజా 50వ జన్మదినం సందర్భంగా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు మంత్రి రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE