ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ మరియు విశాఖపట్నంలో సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 26 వరకు సిటీ బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాతపరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉండడంతో, అందుకు తగిన విధంగా సిటీ బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో మే 21 నుంచే అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు మొదలైనప్పటికీ, సిటీ బస్సు సర్వీసులును మాత్రం ప్రారంభించలేదు. తాజాగా ఈ సచివాలయ పరీక్షల నేపథ్యంలో సిటీ బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu