ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మకర సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ ఇదని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆయన అభిలషించారు. ఈ సంక్రాంతి పండుగ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని కోరుకున్న సీఎం జగన్.. అలాగే ఈ పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్ళలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE