కలెక్టర్లకు కూడా మార్కులు కేటాయిస్తామని, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి) ద్వారా వారి పనితీరుని అంచనా వేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లతో ‘స్పందన’ కార్యక్రమంపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా.. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించి సమీక్ష జరిపారు.
సీఎం జగన్ చేసిన కీలక సూచనలు..
- ఎస్డిజి ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయి. ఎస్డిజి లక్ష్యాలే వారి పని తీరుకి ప్రామాణికం.
- ఉపాధి హామీ కింద కనీస వేతనం రూ. 240 అందేలా చూడాలి.
- కొత్తగా అర్హులైన లబ్దిదారులకు ఫేజ్-3 కింద డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల ఇళ్ళు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
- జగనన్న కాలనీల్లో 3. లక్షలు, 1.5 లక్షల టిడ్కొ ఇళ్ళు పూర్తి చేయాలి.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన తర్వాత నెల రోజుల్లోగా పనులు మొదలు కావాలని ఆదేశించారు.
- అక్టోబర్ 25న ఈ-క్రాపింగ్ జాబితాలు అన్ని సచివాలయల్లో ప్రదర్శించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY