ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ప్రధానంగా.. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ రేపు ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దీనితో పాటుగా చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా వీటికి సంబంధించిన శిలా ఫలకాలను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా సవరవిల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకొని మధురవాడ ఐటీ హిల్స్లో నూతనంగా నిర్మిస్తున్న వైజాగ్ ఐటీ టెక్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు అధికారులతో కీలక సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొననున్న కార్యక్రమాల్లో భద్రత మరియు ఇతర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE