అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు.
“మే డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కార్మికులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశాన్ని బలీయమైనదిగా నిర్మించడంలో వారి చెమట మరియు రక్తాన్ని ఇచ్చిన కార్మికులందరి గొప్ప ప్రయత్నాలను గుర్తించి, సంతోషించాల్సిన రోజు ఈ రోజు… వారి ప్రయత్నాలను గౌరవిద్దాం మరియు వారి కృషికి నమస్కరిద్దాం. కార్మికులందరికీ మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ రోజున, కరోనా మహమ్మారి వ్యాప్తిని ఆపడానికి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని జాగ్రత్తలు మరియు మార్గదర్శకాలను అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం”. – తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
“జాతి నిర్మాణంలో, నాగరికతా వికాసంలో కార్మికుల చెమట, రక్తం వున్నాయి. యావత్ సమాజం కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన తరుణమిది. తెలంగాణ రాష్ట్రంలోని కార్మికలోకానికి, శ్రమ జీవులకు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు” – తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు
“కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. ప్రపంచ ప్రగతి, ఆర్ధిక వ్యవస్థ పురోగతి కార్మికుల స్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలను ధారపోయడం వల్లే సాధ్యమవుతోంది. కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు” – ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
“శ్రమజీవులైన కార్మికులు సంక్షేమంతో వర్ధిల్లినప్పుడే సమాజ ప్రగతి సాధ్యం. వచ్చే మేడే నాటికి కార్మిక కుటుంబాలన్నీ ఆర్థికంగా, సంక్షేమపరంగా పుంజుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. కార్మిక, కర్షక, శ్రామిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు” – టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
“కరోనా కాలంలో కార్మికుల కష్టాలపై సానుభూతితో స్పందించాలి. కార్మిక లోకం శ్రమను గుర్తించి గౌరవించడం మనందరి బాధ్యత. యావత్ కార్మిక లోకానికి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు” – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu