ఆరవ విడత “తెలంగాణకు హరితహారం” కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 25, గురువారం నాడు ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్ లో అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో గురువారం నాడు సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు పరిశీలించారు. నర్సాపూర్ లోని స్థానిక అర్బన్ పార్కులో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ మొక్క నాటుతారని మంత్రి తెలిపారు. మరోవైపు ఆరోవిడుత హరితహారంలో కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమనీ, అందుకు అనుగుణంగా కార్యాచరణకు సిద్ధం చేశామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu