నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 24, బుధవారం నాడు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ పనితీరు, పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం, పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వలనే నోటీసులు జారీచేసినట్టు చెప్పారు. షోకాజ్ నోటీసులో పేర్కొన్న విషయాలపై వారం రోజులులోపు స్పందించాలని పేర్కొన్నారు. గడువులోగా నోటీసుకు సమాధానం ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం తదుపరి చర్యలకు పార్లమెంటరీ పార్టీ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. ఈ నోటీసును వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu