ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తున్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన మంగళవారం రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక పింఛన్లు కేవలం వృద్దులకే కాదని, వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది పింఛన్ల ద్వారా అందించే పైకం మొత్తాన్ని పెంచుకుంటూ పోతున్నామని, రాష్ట్రంలో ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల అమలు మాత్రం నిరాటంకంగా కొనసాగిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
అలాగే అర్హత కలిగి ఉండి రకరకాల కారణాలతో పథకాలు అందుకోలేకపోతున్న పలువురికి ఇటీవలే కొత్తగా పింఛన్లు అందిస్తున్నామని, దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అలాగే మరికొందరికి కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశామని, వీటిని వాలంటీర్లు లబ్దిదారుల ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారని వెల్లడించారు. అయితే తాము ఇన్ని మంచి పనులు చేస్తున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారికి కొన్ని మీడియా సంస్థలు వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు. తమకు మంచి చేస్తున్నదెవరో? వంచన చేస్తున్నదెవరో? ప్రజలు గుర్తించాలని, ముందు ముందు మరిన్ని మంచి పనులు చేసే అవకాశం తనకు ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE