ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (జూన్ 2, గురువారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. అలాగే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో కూడా సీఎం వైఎస్ జగన్ భేటీ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన చట్టం హామీల అమలు, ప్రత్యేక హోదా అంశం, తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. మరోవైపు ఏప్రిల్ నెలలో సీఎం వైఎస్ జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF