విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలియజేశారు. కేంద్ర విమానయానశాఖ మంత్రి మరియు ఎయిర్ ఇండియా అధికారులతో పలుదఫాలుగా రాష్ట్రం తరపున చేసిన వినతులపై వారు స్పందించారని, సాధ్యాసాధ్యాలపై కీలక చర్చలు జరిపిన తర్వాత అనుమతులు లభించాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి షార్జాకు వారంలో రెండు రోజులపాటు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయని ఎంపీ బాలశౌరి తెలిపారు.
ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మరియు శనివారం రాత్రి గం.9:05 ని.లకు ఇక్కడినుంచి విమానం బయలుదేరుతుందని ఎంపీ వివరించారు. ఈ క్రమంలో నేడు షార్జాకు తొలి విమాన సేవలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారు. షార్జా వెళ్లనున్న ప్రయాణికులకు ఆయన బోర్డింగ్ పాసులు అందజేయనున్నారు. అలాగే మస్కట్ మరియు కువైట్ దేశాలకు కూడా విమానాలు నడుస్తాయని తెలిపారు. మస్కట్ కు ప్రతి శనివారం మధ్యాహ్నం గం.1:15 ని.లకు, కువైట్ కు ప్రతి బుధవారం సాయంత్రం గం.4:30 ని.లకు విజయవాడ నుంచి సర్వీసులు నడుస్తాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE