తిరుమలలో నూతన పరకామణి, అతిథి గృహాలను ప్రారంభించిన సీఎం జగన్‌

CM YS Jagan Inaugurates New Parakamani Building and Guest House in Tirumala Today, CM Jagan Opened New Parakamani And Guest Houses In Tirumala, CM Jagan Launches New Parakamani, Jagan Opened New Guest Houses, CM Jagan New Openings In Tirumala, Mango News, Mango News Telugu, New Parakamani, New Guest Houses Opening In Tirumala, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Latest News And Updates, AP CM YS Jagan, YS Jagan Tirumala Tour, Tirumala Tirupati Devasthanam, TTD, TTD Latest News And Live Updates, YS Jagan Open New Tirumala Bhavans

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఆలయం వద్ద ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కాగా సీఎం జగన్ వెంట మంత్రులు కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఆర్కే రోజా సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వామివారి దర్శనానంతరం సీఎం జగన్, సుమారు రూ. 22 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనం ప్రారంభించారు. ఈ భవనంలో శ్రీవారికి వచ్చిన కానుకలు లెక్కించనున్నారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని కూడా ఆయన ప్రారంభించారు. కాగా మంగళవారం బ్రహ్మోత్సవాల మొదటి రోజున ప్రభుత్వం తరపున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =