ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు అభివృద్ధి చెందాలని యేసుక్రీస్తు దీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటనలో.. కరుణ, ప్రేమ, క్షమాపణ, సహనం, దాతృత్వం, త్యాగం అనే అత్యున్నత సందేశాల ద్వారా ఏసుక్రీస్తు మానవాళిని సత్య మార్గం వైపు నడిపించారని తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే చెడు నుండి ధర్మానికి, అమానవీయత నుండి మానవత్వానికి, చెడు నుండి మంచికి, దురాశ నుండి దాతృత్వం మరియు త్యాగం వరకు మానవాళికి యేసు మార్గాన్ని చూపించాడని సీఎం వైఎస్ జగన్ తెలియజేశారు. కాగా వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడే క్రిస్మస్ కేక్ను కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ