ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కాగా గత రాత్రి భీమవరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన రాత్రి 10 గంటల తర్వాత ఇంటిలో గుండెపోటుతో కుప్పకూలగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సర్రాజు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక పాతపాటి మరణవార్త తెలిసిన వెంటనే సీఎం జగన్ ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా లోని సర్రాజు ఇంటికి వచ్చిన సీఎం జగన్.. భౌతికకాయంపై పూలు చల్లి ఘటించారు. అనంతరం సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కాగా ప్రస్తుతం సర్రాజు వయసు 72 సంవత్సరాలు కాగా, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక సర్రాజు 2014కు ముందు వైసీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే 2021 జులైలో ఏపీ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్గా ఆయన నియమితులయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE