ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం ఉంది, అన్నీ ఆలోచించే హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్పు – అసెంబ్లీలో సీఎం జగన్

CM YS Jagan Responds Over The Name Change Of NTR Health University As YSR Varsity In Assembly, CM YS Jagan Responds Over University Name Change, Name Change Of NTR Health University As YSR Varsity, AP CM YS Jagan Mohan Reddy, NTR Health University, Dr YSR Health Varsity, TDP Chief Chandrababu Naidu, AP Govt Decision to Name Change of NTR Health University After YSR, Mango News, Mango News Telugu, AP Former CM YS Rajashekar Reddy, Former CM Nandamuri Taraka Rama Rao, YSR Congress Party, Telugu Desham Party, AP Assembly Session

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్టీఆర్‌ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్పుపై బుధవారం శాసనసభలో వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్‌ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్పుపై తొలుత ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం దీనిపై చర్చకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బిల్లుని పూర్తిగా సమర్ధిస్తున్నామని వారు తెలిపారు. కాగా ఈ బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక దీనిపై మాట్లాడిన సీఎం జగన్ ఎన్టీఆర్‌ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్పుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ గౌరవం ఉందని అన్నారు. ఇంతవరకూ తాను కానీ, తమ పార్టీ సభ్యులు కానీ ఎప్పుడూ ఎన్టీఆర్‌పై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతానని తాను చెప్పానని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేశానని సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పుడు కూడా అన్ని ఆలోచించే యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నాడు చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉండి ఉంటే ఎన్టీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పనిచేసేవారని, అలాగే ఎక్కువ రోజులు బతికి ఉండేవారని అన్నారు. ఇక చంద్రబాబు కేంద్రంలో రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను తాను నియమించినట్లు చెప్పుకుంటుంటారని, అలాంటప్పుడు ఎన్టీఆర్‌కు ఎందుకు భారతరత్న ఇప్పించలేకపోయారని సీఎం జగన్ ప్రశ్నించారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడానికి చాలా ఆలోచించామని, ఇది మంచిదేనా? కాదా? అని తనను తాను ప్రశ్నించుకున్నానని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ స్వతహాగా డాక్టర్ అని, అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేదవారికి ఆరోగ్యం అందాలనే ఆకాంక్షతో పలు ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టారని గురుత్ చేశారు. విద్యాభ్యాసం తర్వాత వైఎస్ తొలుత పులివెందులలో వైద్య సేవలు అందించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 104, 108 అంబులెన్సులు ఆయన తీసుకొచ్చినవేనని, ఇంకా రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఏర్పాటు కావడానికి కృషి చేశారని వెల్లడించారు.  అందుకే ఆయన చేసిన సేవలకు ప్రతిగా ఆయనను గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 16 =