ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 8:30 గంటలకు ఢిల్లీ చేరుకుని, జనపథ్1 లోని ముఖ్యమంత్రి నివాసంలో బస చేయనున్నారు. ఇక బుధవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన క్లిష్ట పరిస్థితులు, ఇప్పటికీ పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను సీఎం జగన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు. విభజన సమయంలో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం చేసిన వాగ్దానాలను గుర్తు చేసి వాటి అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ యొక్క సవరించిన వ్యయాన్ని మంజూరు చేయాలని ప్రధాని మోదీకి విన్నవించనున్నారు. అలాగే షెడ్యూల్ 9 మరియు 10 సంస్థల విభజనను సత్వరమే చేపట్టాల్సిందిగా ప్రధానమంత్రిని కోరనున్నారు. దీంతో పాటు మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాల్సిందిగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY