ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం, మే 19, 2023) విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని వరుసగా మూడో ఏడాది నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పనితీరులో చక్కని ప్రతిభ చూపించిన ఉత్తమ వాలంటీర్లను నగదు బహుమతితో సీఎం జగన్ సత్కరించనున్నారు. కాగా కనీసం ఒక ఏడాది పాటు వలంటీర్గా పనిచేస్తూ.. వారిపై ఎలాంటి ఫిర్యాదులు, వివాదాలు లేని వారికి ఈ ఉత్తమ వాలంటీర్ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇక సన్మాన కార్యక్రమం అనంతరం సీఎం జగన్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE