ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గురువారం ఉదయం శాసనసభలో రూ.2,79,279 కోట్ల అంచనా వ్యయంతో 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 2023-24 పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు. “మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారిత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్ ద్వారా మరో అడుగు ముందుకేశాం” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారిత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్ద్వారా మరో అడుగు ముందుకేశాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE