ఏపీలో నేటి నుంచే కర్ఫ్యూ సడలింపులు అమలు

Andhra Pradesh government extends curfew, Andhra Pradesh Govt Extends Covid curfew, Andhra Pradesh govt extends COVID-19 curfew, Andhra Pradesh govt extends curfew, AP Government Announces Relaxation In Curfew Timing After Reviewing COVID-19 Situation In State, AP Govt Announces Curfew Relaxations, AP govt extends COVID curfew, AP Govt Extends Curfew, Curfew Relaxations from June 21st, Govt Announces Curfew Relaxations, June 21st Relaxation Time Increases to 6 PM, latest updates, Mango News

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను జూన్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం నాడు ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగింపు, కర్ఫ్యూ సడలింపు సమయం పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో నేటి నుండి (జూన్ 21) ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు సమయం అమల్లోకి రానుంది.

ఇక ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయనున్నారు. దుకాణాలను తెరిచేందుకు మాత్రం సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక కరోనా ప్రభావం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుందని చెప్పారు. ప్రజలంతా సహకరించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =