రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను జూన్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం నాడు ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగింపు, కర్ఫ్యూ సడలింపు సమయం పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో నేటి నుండి (జూన్ 21) ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు సమయం అమల్లోకి రానుంది.
ఇక ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయనున్నారు. దుకాణాలను తెరిచేందుకు మాత్రం సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక కరోనా ప్రభావం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుందని చెప్పారు. ప్రజలంతా సహకరించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ