జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీలోకి చేరారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు బొంతు రాజేశ్వరరావును పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజేశ్వరరావు రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైసీపీ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. రాజేశ్వర రావు తన అనుచరులతో కలిసి తాజాగా జనసేనలో చేరారు.
అలాగే విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గురాన అయ్యలును పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ కండువా వేశారు. ఇక ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నగరం ఏఎంసీ ఛైర్మన్ కొమ్మూరి కొండలరావుకి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి, జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్(పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE