ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 56 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా గుంటూరు జిల్లాలో 19, కర్నూల్ లో 19, చిత్తూరు జిల్లాలో 6, కడపలో 5, ప్రకాశంలో 4, కృష్ణాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 813 పాజిటివ్ కేసులకు గాను 120 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు ఈ వైరస్ వలన 24 మంది మరణించారు. ప్రస్తుతం 669 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 21, మంగళవారం నాటికి 928కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం 928 పాజిటివ్ కేసులకు గాను 23 మంది మృతి చెందగా, 194 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించారు. ప్రస్తుతం 711 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 56 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 813 పాజిటివ్ కేసు లకు గాను 120 మంది డిశ్చార్జ్ కాగా, 24 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 669. #APFightsCorona pic.twitter.com/fMSjT6d2RX— ArogyaAndhra (@ArogyaAndhra) April 22, 2020
Media Bulletin
Date: April 21, 2020District wise status update on #Coronavirus positive cases in Telangana. pic.twitter.com/rgXu1sCj2E
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 21, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu